11 Sep 2026, Friday
HomeNRI
NRI

రాజంపేట పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ ప్రవాసాంధ్రుల సమస్యలపై చర్చ.. పరిష్కారానికి APNRTS సమన్వయం

By PRAJA NADU Desk 09 Aug 2026, 05:27 PM Updated: 10 Sep 2026, 06:54 PM 413 views
రాజంపేట పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ ప్రవాసాంధ్రులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారంపై APNRTS ప్రతినిధులు అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబుతో చర్చించారు. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించడంతో పాటు, APNRTS అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించేందుకు అన్నమయ్య జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో అవగాహనా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
రాజంపేట పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ ప్రవాసాంధ్రుల స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, APNRTS చైర్మన్ శ్రీ రవి వేమూరి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి శ్రీ రావి రాధా కృష్ణ గారి మార్గదర్శకత్వంలో ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం APNRTS నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని APNRTS డైరెక్టర్ – ఆపరేషన్స్ & సర్వీసెస్ శ్రీ నాగేంద్ర బాబు అక్కిలి మరియు అడ్వకేట్ శ్రీ కొమ్మినేని వెంకట సుబ్బయ్య ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన గల్ఫ్ ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రవాసాంధ్రుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – APNRTS సమన్వయంతో సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. APNRTS ప్రధాన సేవలు ప్రవాసాంధ్రుల ఫిర్యాదుల పరిష్కారం వలస వనరుల కేంద్రం (MRC) మృతదేహాల స్వదేశానికి తరలింపు సహాయం పాస్‌పోర్ట్ & కాన్సులర్ సేవలు ప్రవాసాంధ్ర భరోసా బీమా ఎన్‌ఆర్‌ఐ పోలీస్ & న్యాయ సహాయం అత్యవసర సహాయ సేవలు దేవాలయ సేవలు APNRTS సభ్యత్వం & ఇతర ప్రవాసాంధ్ర సేవలు అదేవిధంగా, APNRTS అందిస్తున్న సేవలపై ప్రవాసాంధ్రులు మరియు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించేందుకు అన్నమయ్య జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో అవగాహనా సదస్సులు నిర్వహించాలని కూడా చర్చించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించడం మరియు ప్రతి కుటుంబానికి సేవలు చేరేలా సమన్వయంతో ముందుకు సాగడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. APNRTS – సేవే లక్ష్యం | సమస్యల పరిష్కారమే సంకల్పం

Related Stories